పాక్ బోటులో రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్

పాక్ బోటులో రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్

గుజ‌రాత్  తీరంలో ఇండియ‌న్ కోస్టు గార్డు పోలీసులు ..పాకిస్తాన్ బోటును పట్టుకున్నారు. ద్వారక దగ్గర పాక్ బోటు అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిందని గుర్తించిన అధికారులు..జాలర్లను అరెస్ట్ చేశారు. గుజ‌రాత్ ఏటీఆఎస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు అరెస్టు చేశారు. 

మొత్తం ప‌ది మందితో కూడిన పాక్ బోటును గుజ‌రాత్ తీరంలో కోస్టు గార్డు పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే ఆ బోటులో ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 40 కేజీల బ‌రువు ఉన్న మాద‌క‌ద్రవ్యాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.