
న్యూఢిల్లీ: 2018–-19 – 2021-–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 32,403 కోట్ల జీఎస్టీని ఎగవేసిందని ఇన్ఫోసిస్కు ఇచ్చిన షోకాజ్ నోటీసులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీసీఐ) నిలిపివేసింది. డీజీసీఐ నుంచి కమ్యూనికేషన్ అందిన తర్వాత “ఈ విషయం క్లోజ్ అయింది” అని కంపెనీ ప్రకటించింది.
ప్రీ- షోకాజ్ నోటీస్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు డీజీసీఐ నుంచి కమ్యూనికేషన్ అందిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. జులై 2017 నుంచి మార్చి 2022 వరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద కంపెనీ ఐజీఎస్టీ చెల్లించలేదని డీజీసీఐ గతంలో ప్రీ- షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది.