
భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల గురించి జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టఫర్ ఉడ్ స్పందించారు. ప్రస్తుతం భారత ఈక్విటీ స్టాక్స్ అధిక విలువల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయని హెచ్చరించారు. ప్రధానంగా మిడ్ క్యాప్ కేటగిరీ కంపెనీల షేర్లతో పాటు వరుసగా మార్కెట్లోకి వస్తున్న ఐపీవోల ప్రమాదాలను సూచిస్తున్నాయని హెచ్చరించారు.
ALSO READ | ఏఐ కంపెనీని టార్గెట్ చేసిన ఆపిల్.. పెర్ప్లెక్సిటీ ఏఐ కొనుగోలుకు ప్లాన్..
ఏప్రిల్ నుంచి వరుసగా మార్కెట్ల పెరుగుదల చాలా దూరం కొనసాగిందని క్రిస్ అన్నారు. భారత మార్కెట్లలో ప్రధానంగా పెరిగిన ఈక్విటీల సప్లై ప్రమాదకరంగా మారిందని చెప్పారు. సెప్టెంబర్ 2023కి ముందు నుంచి భారత మార్కెట్లలో ఈక్విటీల ఇష్యూ 7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కానీ గత నెల ఇది 7.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుత మాసంలో ఇప్పటి వరకు ఇది 6 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం తర్వాతి నుంచి మార్కెట్లలో కన్జమ్షన్ థీమ్ కేటగిరీ రంగంలోని కంపెనీలపై పెట్టుబడిదారుల ఫోకస్ పెరిగిందని క్రిస్ పేర్కొన్నారు. దీంతో కన్జూమర్ ఫైనాన్స్ రంగంలోని షేర్లు భారీగా ర్యాలీని చూసినట్లు పెర్కొన్నారు. అలాగే భారతదేశంలో ప్రాపర్టీ మార్కెట్ కూడా వరుసగా 5వ ఏటా పెరుగుదలను చూస్తోందని చెప్పారు. పైగా వడ్డీ రేట్లను ఇటీవల రిజర్వు బ్యాంక్ తగ్గించటం పెద్ద ప్రోత్సాహకంగా నిలిచిందన్నారు.