ఏఐ కంపెనీని టార్గెట్ చేసిన ఆపిల్.. పెర్ప్లెక్సిటీ ఏఐ కొనుగోలుకు ప్లాన్..

ఏఐ కంపెనీని టార్గెట్ చేసిన ఆపిల్.. పెర్ప్లెక్సిటీ ఏఐ కొనుగోలుకు ప్లాన్..

వేగంగా విస్తరిస్తున్న ఏఐ యుగంలో టెక్ కంపెనీలు తమ పోటీని ఏఐ వినియోగంతో తర్వాతి స్థాయిలకు తీసుకెళుతున్నాయి. అమెరికా దిగ్గజ సంస్థలు తమ ఏఐ ఉత్పత్తులను తయారు చేసుకుని మార్కెట్లో ఉత్తమ సేవలను అందించాలని తహతహలాడుతున్నాయి.

ఈక్రమంలో ఆపిల్ రియల్ టైమ్ కాన్వర్జేషన్ ఏఐ సెర్చ్ ఇంజిన్ గా పేరొందిన పెర్ప్లెక్సిటీపై తన దృష్టిని సారించింది. కంపెనీ ప్రస్తుతం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం కంపెనీ విలువ 14 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్లకు పైగానే ఉంది. దీనిని గనుక ఆపిల్ సంస్థ కొనుగోలు చేస్తే ఇది అతిపెద్ద కొనుగోలుగా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం సంస్థ కొనుగోలుకు చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | గూగుల్, ఇన్ స్టాగ్రామ్,ఫేస్ బుక్ పాస్ వర్డ్లు లీక్ అవుతున్నాయి.. మీ అకౌంట్లు సేఫేనా?..ఇలా చెక్ చేసుకోండి

అయితే కొనుగోలు గురించి ఆపిల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. గడచిన కొన్ని నెలలుగా టెక్నాలజీ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని గమనిస్తూ.. సంస్థ ప్రతినిధులతో తరచూ చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. దీనిపై ఆపిల్ అధికారికంగా స్పందించలేదు. 

ఆపిల్ పెర్ప్లెక్సిటీ కంపెనీని ఎందుకు కొనాలనుకుంటోంది..
ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ పరుగుపందెంలో ఇతర టెక్ దిగ్గజాల సరసన నిలిచేందుకు ఆపిల్ వేగంగా కదులుతోంది. అందుకే పెర్ప్లెక్సిటీ కొనుగోలు తనకు ఈ రేసులో తక్షణ మార్గంగా భావిస్తోంది. ఇది ఎక్కువ మంది కస్టమర్లకు ఆకట్టుకోగలదని కంపెనీ భావిస్తోంది. అయితే కొనుగోలు కాకుండా కంపెనీ సేవలను పొందటానికి భాగస్వా్మ్యాన్ని కూడా ఆపిల్ కోరవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆపిల్ సిరి సేవలను మెరుగుపరచటం లేదా సఫారీ సెర్చ్ ఇంజిన్లో జోడించటం కోసం ఉపయోగించవచ్చని తెలుస్తోంది.