టాటా కార్ల ధరలు మళ్లీ పైకి.. జులై నుంచి పెంచుతున్నట్లు ప్రకటన

టాటా  కార్ల ధరలు మళ్లీ పైకి.. జులై నుంచి పెంచుతున్నట్లు ప్రకటన

న్యూఢిల్లీ:  టాటా మోటార్స్  తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఈవీల ధరలను కూడా 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

మూడు నెలల గ్యాప్‌‌‌‌లో  కంపెనీ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ 1న కూడా ధరలను పెంచింది.   పశ్చిమాసియా సంక్షోభం  కారణంగా ఏర్పడిన అంతరాయాలు, పెరిగిన ముడిసరుకు ఖర్చులే ధరలు పెంచడానికి కారణమని కంపెనీ తెలిపింది.