కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్ డాక్టర్లు (జూడాలు) నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు. రేపటి(ఆదివారం) నుంచి ఈ నెల 26 వరకు నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. తమకు పెంచిన స్టైఫండ్, కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ..నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటామని తెలిపారు. ఈ నెల 26 తర్వాత విధులు బహిష్కరించనున్నట్టు హెచ్చరించారు. ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్లకు..గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి జూనియర్ డాక్టర్లు నోటీసులిచ్చారు.
