కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.  కొందరిని ఒక మండలం నుంచి మరో మండలానికి మార్చగా,  కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో పని చేస్తున్న ఏవో(అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్) లను ఆయా మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు. 

సదాశివనగర్ తహసీల్దార్​గా  సత్యానారాయణ, బీబీపేట తహసీల్దార్​గా గంగాసాగర్​, తాడ్వాయి తహసీల్దార్​గా శ్వేత, భిక్కనూరు తహసీల్దార్​గా సునీత, మాచారెడ్డి తహసీల్దార్​గా సరళాబాయి, కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్ ఏవోగా శివప్రసాద్, డొంగ్లి తహసీల్దార్​ ప్రవీణ్ కుమార్,  బాన్సువాడ ఆర్డీవో ఆఫీస్ ఏవోగా అనిల్​కుమార్​, నస్రుల్లాబాద్​ తహసీల్దార్​గా సువర్ణ, దోమకొండ తహసీల్దార్​సుధాకర్, నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్​ను గాంధారికి,  కిష్టయ్యను రామారెడ్డి తహసీల్దార్​ ఆఫీసుకు బదిలీ చేస్తూ  ఆదేశాలు ఇచ్చారు.