
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరిని ఒక మండలం నుంచి మరో మండలానికి మార్చగా, కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో పని చేస్తున్న ఏవో(అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్) లను ఆయా మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు.
సదాశివనగర్ తహసీల్దార్గా సత్యానారాయణ, బీబీపేట తహసీల్దార్గా గంగాసాగర్, తాడ్వాయి తహసీల్దార్గా శ్వేత, భిక్కనూరు తహసీల్దార్గా సునీత, మాచారెడ్డి తహసీల్దార్గా సరళాబాయి, కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్ ఏవోగా శివప్రసాద్, డొంగ్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, బాన్సువాడ ఆర్డీవో ఆఫీస్ ఏవోగా అనిల్కుమార్, నస్రుల్లాబాద్ తహసీల్దార్గా సువర్ణ, దోమకొండ తహసీల్దార్సుధాకర్, నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్ను గాంధారికి, కిష్టయ్యను రామారెడ్డి తహసీల్దార్ ఆఫీసుకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.