రైతులకు రూ.10 వేలు..ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3వేలు

రైతులకు రూ.10 వేలు..ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3వేలు

కరోనా సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారి కోసం రూ. 1200 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ్లు, కూరగాయలు పండించే ఉద్యాన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు. అలాగే ఆటో, ట్యాక్సి,  క్యాబ్ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 3వేలు. మెకానిక్, అసంఘటిత కార్మికులు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2 వేలు ఇవ్వనున్నారు. కర్ణాటకలో ఈ నెల 24 తో లాక్ డౌన్ ముగుస్తుంది. లాక్ డౌన్ పొడిగింపుపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.