సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు : చందన్ కుమార్

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు : చందన్ కుమార్
  • జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు :  సన్న బియ్యం బయట అమ్మితే రేషన్ కార్డు రద్దు చేస్తామని, కొన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీనివాస్ నగర్, ప్రకాశ్​నగర్ లో రేషన్ షాపులను డిప్యూటీ తహసీల్దార్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలల రేషన్ పంపిణీ ప్రక్రియ సాఫీగా జరుగుతోందని తెలిపారు. జిల్లాకు 21,915 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం స్టాక్ వచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 4,15, 904 రేషన్ కార్డులకు గానూ ఇప్పటి వరకు  3,3 ,596 రేషన్ కార్డులకు బియ్యం అందినట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 213 క్వింటాళ్ల సన్న బియ్యం పట్టుకుని నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.