KTR సార్ మా దళిత వాడను డెవలప్ చేయండి

KTR సార్ మా దళిత వాడను డెవలప్ చేయండి

తమ దళిత వాడను అభివృద్ధి చేయాలంటూ ఇద్దరు చిన్నారులు మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు. అది కూడా ప్లకార్డులు పట్టుకుని బురదలో దిగి.

వేములవాడ నియోజకవర్గ కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని దళిత వాడకు చెందిన  జాన్సన్, బ్లేస్సి అనే ఇద్దరు చిన్నారులు బురద రోడ్డులో దిగి ప్లకార్డుతో నిరసన తెలిపారు. KTR సార్ మా  దళితవాడలో సీసీ రోడ్లు పోయించండి.. మేము  మా చిన్నతనం నుండి..ఈ బురద రోడ్ల లో నుండే స్కూలుకు వెళ్తున్నామని తెలిపారు. కొనరావుపేట మండంలంలోని ప్రజా పతినిధులను మా తల్లిదండ్రులు ఎన్ని సార్లు వేడుకున్నా మా దళితవాడను అభివృద్ధి చేయడం లేదని అంటున్నారు. ఓట్లప్పుడే మా కాలనీ కి వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మాకాలనీనీ తిరిగి ఎప్పుడు చూడలేదన్నారు. అంతేకాదు.. ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. మా MLA, జడ్పీ చైర్పర్సన్ లు .గెలిచిన నాటినుండి మా కాలనీకి రాలేదన్నారు. KTR సార్ మీరన్న మా కాలనీలో CC రోడ్లు పోయించడంతో పాటు.. డ్రైనేజీ నిర్మాణాలు చేయించండి అని వేడుకుంటున్నారు ఆ ఇద్దరు చిన్నారులు.