నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 85వ నుమాయిష్లో మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేడీస్ డే సెలబ్రేషన్స్లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి మాట్లాడారు.
నిజాం కాలం నుంచి మహిళల కోసం నుమాయిష్లో ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించేవారని, అది నేటికీ కొనసాగడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల విద్యార్థినిలు చేసిన కూచిపూడి, కథక్, ఫోక్ డాన్స్లు ఆకట్టుకున్నాయి. – వెలుగు, బషీర్ బాగ్
