ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వచ్చే నెల 9–11 వరకు ఎల్ఈడీ ఎక్స్పో 27వ ఎడిషన్ జరగనుంది. ఈసారి కొత్తగా 49 కంపెనీలు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు.
185కిపైగా కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించనున్నాయి. నాలెడ్జ్ షేరింగ్, నెట్వర్కింగ్ వంటి కార్యక్రమాలూ ఉంటాయి. దేశంలో ఎల్ఈడీ ప్రొడక్టుల తయారీకి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్ అన్నారు.