ముంబైలో ఎల్‌‌ఈడీ ఎక్స్‌‌పో

ముంబైలో ఎల్‌‌ఈడీ ఎక్స్‌‌పో

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌‌లో వచ్చే నెల  9–11 వరకు ఎల్​ఈడీ ఎక్స్‌‌పో 27వ ఎడిషన్‌‌ జరగనుంది. ఈసారి కొత్తగా   49 కంపెనీలు  పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు.  

185కిపైగా  కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించనున్నాయి. నాలెడ్జ్​ షేరింగ్​, నెట్‌‌వర్కింగ్ వంటి కార్యక్రమాలూ ఉంటాయి. దేశంలో ఎల్​ఈడీ ప్రొడక్టుల తయారీకి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్​ గోయల్​ అన్నారు.