- మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య వెల్లడి
మాదాపూర్, వెలుగు: రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. న్యాయం జరిగే వరకు ఈ నెల 28 నుంచి ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.శుక్రవారం మాదాపూర్ ఇజ్జత్నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు, బీఎస్పీ లీడర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాల సంఘం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడారు. రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని, తమ వర్గానికి ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కృషి చేశామన్నారు. ఔట్సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
