భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణోదేవీ ఆలయం

భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణోదేవీ ఆలయం

చైత్ర నవరాత్రి సందర్భంగా జమ్మూకశ్మీర్ కత్రానగర్ కొండల్లో కొలువై వైష్ణోదేవీ ఆలయం కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. కరోనా ఆంక్షలన్నీ తొలగిపోవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మళ్లీ మునుపటి రోజులు వచ్చినట్లు.. పాత రోజులను చూస్తున్నట్లు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో భద్రతాదళాలు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

గవర్నర్ యాదాద్రి పర్యటనకు హాజరుకాని ఈవో

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్ 

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు