పాంటింగ్, ధోని రికార్డు బద్దలు

పాంటింగ్, ధోని రికార్డు బద్దలు

మహిళల టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ మేగ్ లానింగ్ చరిత్ర సృష్టించింది.  దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్, మ‌హేంద్ర సింగ్ ధోనీల రికార్డును బద్దలు కొట్టింది.  అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించిన  తొలి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. మేగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 

మేగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్..2014, 2018, 2020, 2023లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అంతేకాకుండా 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్లోనూ విజేతగా నిలిచింది. అటు 2022 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో లానింగ్ నాయకత్వంలోనే ఆస్ట్రేలియా ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. దీంతో ఆసీస్‌కు ఐదు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి కెప్టెన్‌గా లానింగ్ రికార్డు నెలకొల్పింది. 

క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించిన కెప్టెన్లు ముగ్గురు ఉన్నారు. ఈ  జాబితాలో మేగ్ లానింగ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. రెండో స్థానంలో  రికీ పాంటింగ్ నిలిచాడు. పాంటింగ్  కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003,2007 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లను సాధించింది. ఆ తర్వాత 2006,2009 లో ఛాంపియ‌న్స్ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఈ జాబితాలో  టీమిండియా  మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడో ప్లేస్‌లో ఉన్నాడు.  ధోని కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకుంది. 2007లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్, 2011లో వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని భారత జట్టు గెలిచింది.