నార్త్ ఇటలీలోని మిలన్ సిటీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి. అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
మిలన్ సిటీలో పార్క్ చేసిన వ్యాన్లో పేలుడు సంభవించిందని స్కైటిజి 24 న్యూస్ ఛానెల్ వెల్లడించింది. మంటల్లో కార్లు దగ్గమయ్యాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. మంటల్లో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు
ఆక్సిజన్ గ్యాస్ డబ్బాలను రవాణా చేస్తున్న వ్యాన్లో పేలుడు సంభవించినట్లు స్కైటిజి 24 న్యూస్ ఛానెల్ అనుమానిస్తోంది. వాహనాలు పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోవడంతో..ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ వ్యాపించింది. సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్ హోం ఉండగా.. అందులో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు.