మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం

 మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం

మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. తొర్రూరు నుంచి జనగామ కు కాన్వాయ్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్ కి ఎదురుగా వస్తున్న  ట్రాక్టర్ వీల్స్ ఊడిపోయాయి. ట్రాక్టర్ లోంచి కింద పడిపోయిన  వీల్స్.. ఒక్కసారిగా కాన్వాయిలోని వెహికిల్ కు ఢీకొట్టాయి. వెలిశాల- కొడకండ్ల మధ్యలో ఈ ఘటన జరిగింది. బుల్లెట్ ఫ్రూవ్ వాహనం కావడంతో ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి గాయాలు కాకపోవడం ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.