
- మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: డబుల్బెడ్రూమ్స్కోసం పేదలు పదేళ్లుగా ఎదురుచూశారని బీఆర్ఎస్హయాంలో 4 వందల ఇండ్లు కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. గురువారం ఆయన అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ మనుచౌదరితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలోనే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు.
ఆర్థిక స్థోమత లేని వారికి మహిళా సంఘాల నుంచి రూ.లక్ష రుణం అందజేస్తున్నామన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఇంటి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. రెండు నెలల్లో మరో 3500 ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. అంతకు ముందు హుస్నాబాద్ కేజీబీవీ లో కంప్యూటర్ ల్యాబ్, అక్కన్నపేట మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, లైబ్రరీ చైర్మన్లింగమూర్తి, డీఈవో శ్రీనివాస్, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మెన్ శివ్వయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లకు పునర్వైభవం తీసుకురావాలి
సిద్దిపేట రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, టీచర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి పునర్వైభవం తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీవీబీనీ సందర్శించి స్టూడెంట్స్తో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ పక్షాన 25వేల స్కూల్స్ప్రారంభమయ్యాయని, పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని ముందస్తుగానే అందిస్తున్నామన్నారు. డైట్ కాస్మొటిక్ చార్జీలను కూడా పెంచామని గుర్తుచేశారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున స్టూడెంట్స్కు అన్ని రకాల వసతులను అందిస్తున్నామని, ఏమైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని సూచించారు.