
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరికి డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ త్వరలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులతో సంప్రదించి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు శ్రీహరిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.