
మహబూబ్నగర్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గానికి కొత్తగా రెండు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడ్జిల్ మండలం మున్ననూరులో, జడ్చర్ల మండలం పెద్దపల్లి (చిన్నపల్లి) గ్రామాల్లో ఈ సబ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు చెప్పారు. పెద్దపల్లి సబ్ స్టేషన్ను రూ.3.56 కోట్లతో, మున్ననూర్ సబ్ స్టేషన్ను రూ.3.61 కోట్ల నిర్మించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటికే తొమ్మిది సబ్ స్టేషన్లు మంజూరు కాగా, ఇప్పుడు మరో రెండు మంజూరు కావడంతో నియోజకవర్గానికి కాంగ్రెస్ హయాంలో కొత్తగా వచ్చిన సబ్ స్టేషన్ల సంఖ్య 11కు పెరిగిందని చెప్పారు. అంతకుముందు ఆయన మిడ్జిల్ మండలం కంచన్పల్లి గ్రామంలో నిర్వహించిన కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.