రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్​: ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్​: ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి  విమర్శించారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రధానమంత్రి మన్ కీ బాత్ ను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా సక్రమంగా అమలు కాలేదన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్​కు అందాల పోటీ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రాహుల్ గాంధీ దేశ భద్రత విషయంలో ఆర్మీ వాళ్లపై చులకనగా మాట్లాడడం తగదన్నారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు లోక భూపతిరెడ్డి,  పెద్దోళ్ల గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు, టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, కలికోట గంగాధర్ , నూతుల శ్రీనివాస్, జెస్సు అనిల్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.   

సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి  

ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యే  రాకేశ్​రెడ్డి రాగా, వివిధ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్సిపల్ ఉద్యోగి కొండ్రపేట నరేష్ సాయమందించాలని కోరారు. జర్నలిస్టు కాలనీ, వడ్డెర కాలనీ, దూదేకుల కాలనీ, రంగాచారి కాలనీ లోని వరద నీరు  ఇండ్లల్లోకి వస్తుందని హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు బీజేపీ బీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ యామాద్రి భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు.  ఆర్మూర్ మీదుగా రెండు జాతీయ రహదారులు వెళుతున్నందున ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని, ఆర్మూర్ లో రూరల్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ ఎమ్మెల్యే కు  వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయిని భాస్కర్, వెంకట నర్సయ్య, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.