భర్తతో గొడవ.. తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

భర్తతో గొడవ.. తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

మల్కాజిగిరి, వెలుగు: నేరేడ్​మెట్ కు చెందిన గోల్ల దీప అలియాస్​పద్మ, ఆమె ముగ్గురు పిల్లలు అఖిల్, చైత్రవి, యశ్వంత్ కృష్ణ అదృశ్యమైనట్లు సీఐ సందీప్ తెలిపారు. దీప ఈ నెల 1న భర్త వీరేశ్​తో గొడవ పడింది. మరుసటి రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పిల్లలను తీసుకొని సైనిక్ పురిలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. 4న స్వగ్రామం సత్యసాయి జిల్లా ధర్మవరం వెళ్తున్నానని చెప్పింది. తర్వాత ఆచూకీ తెలియలేదు. దీంతో వీరేశ్​శనివారం నేరేడ్​మెట్​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. 

తొమ్మిదో తరగతి విద్యార్థి..

మేడ్చల్, వెలుగు: ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ పీఎస్​పరిధిలోని జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ లో కార్తీక్ తొమ్మిదో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్​లో ఉంటున్నాడు. 8 రోజుల క్రితం స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ చితకబాదారని, అప్పటినుంచి కార్తీక్​కనిపించడం లేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆరోజే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెతుకుతున్నా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదని కంటతడి పెట్టారు.