శ్రీవారి‌ సేవలో టెబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

శ్రీవారి‌ సేవలో టెబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని నైనా జైస్వాల్ ఇవాళ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేధ్య విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా నైనా జైస్వాల్ ప్రశంసించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.