టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్.. ఇవాళ గతంలో ఆపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ వ్యవహారాలు చూడటం, పార్టీని నడిపించడం కోసం నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. 79 రోజుల విరామం ఈరోజు సోమవారం ( నవంబర్ 27) అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలవాడలో 210వ రోజు యాత్రను యువనేత పున:ప్రారంభించారు.