
హైదరాబాద్, వెలుగు: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగాలని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిపై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ను కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు నోటీసులు జారీ చేశారు.
ఈ వ్యాఖ్యలు ఎపుడు చేశారు, ఎవరైనా ఫిర్యాదు చేశారా, చర్యలు తీసుకున్నారా వంటి వివరాలను రిప్లైలో ఫార్మాట్ ప్రకారం అందచేయాలని ఆదేశించారు. ఇటీవల గురుకుల ప్రిన్సిపల్స్ తో జరిగిన జూమ్ మీటింగ్ లో సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలు చేయటం తీవ్ర దుమారం రేపాయి. రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీశాయి.