
- రికార్డు పత్రాలిచ్చిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవ యువ నిర్మాణ్ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయడం మంచి ఆలోచన అని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథ్పెరుమాళ్ల అన్నారు. శుక్రవారం యూసుఫ్ గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సామూహిక సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలకు గర్భిణులు, తల్లులు, పిల్లలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
విశ్వనాథ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతులమీదుగా అన్నప్రాసన, సీమంత జరిపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో 2 వేల మంది గర్భిణులకు సీమంతం, సుమారు 1,000 మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించామన్నారు. అనంతరం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆయనకు రికార్డు పత్రాలు అందజేశారు.
సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, మైనారిటీస్రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూషన్సొసైటీ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి, కాంగ్రెస్పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి అజారుద్దీన్, సీనియర్ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.