యాదాద్రి, వెలుగు: వాతావరణంలోని మార్పులను రికార్డ్చేయడానికి యాదాద్రి జిల్లాలో మరో ఆటోమెటిక్ వెదర్స్టేషన్ (ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. ఏడబ్ల్యూఎస్తో ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగంతో పాటు వర్షపాతం వివరాలు ఆటోమెటిక్గా రికార్డు చేస్తాయి. ఈ రిపోర్ట్ ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీకి అందుతాయి. ఇలాంటి ఏడబ్ల్యూఎస్లు జిల్లాలో ఇప్పటివరకూ 28 ఉన్నాయి.
తాజాగా యాదాద్రి కలెక్టరేట్లో ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయి. దీని ఏర్పాటు కోసం స్థలం గుర్తించినట్టు సీపీవో వెంకట రమణ తెలిపారు. ఈ ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నప్పటికీ.. ప్రతి మండలంలోనూ మాన్యువల్గా వెదర్ రిపోర్ట్ కోసం ఏర్పాట్లు చేశారు.
