కమలాపూర్, వెలుగు: రేషన్కార్డు రద్దయిందని ఫోన్చేసిన సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోని రూ. 42 వేలు కొట్టేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్మండలం మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద బీహార్కు చెందిన రామ్ జిత్యాదవ్ జేసీబీ డ్రైవర్గా చేస్తున్నాడు. గురువారం ఉదయం 11 గంటలకు రామ్జిత్కు మీ రేషన్కార్డు క్యాన్సిల్అయ్యిందంటూ ఫోన్ చేశారు. కార్డు మళ్లీ యాక్టివ్ చేయాలంటే ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీ చెప్పాలన్నారు. వారి మాటలు నమ్మిన రామ్జిత్ఓటీపీ నంబర్ చెప్పాడు. కాసేపటికే మళ్లీ ఫోన్ చేసి కార్డు యాక్టివ్కాలేదని, మళ్లీ ఓటీపీ చెప్పాలన్నారు. రామ్జిత్వారికి నంబర్చెప్పాడు. కొద్దిసేపటికే బ్యాంకు నుంచి రూ. 20 వేలు ఓసారి, రూ. 22 వేలు మరోసారి డ్రా అయినట్లు మెసేజ్వచ్చింది. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత వ్యక్తులు ఫోన్చేస్తే ఓటీపీ నంబర్ చెప్పవద్దని, ఫోన్పే స్కానర్లను పంపవద్దని, లింక్లు ఓపెన్ చేయద్దని సీఐ సంజీవ్కుమార్ చెప్పారు. అనుకోకుండా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు కొంతవరకు తిరిగి పొందవచ్చన్నారు.
