ఎర్రుపాలెం, వెలుగు : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో టేకు చెట్లు కొట్టేందుకు పర్మిషన్అడిగితే లంచమడిగిన ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లను బుధవారం ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణమూర్తి కథనం ప్రకారం..గంపలగూడానికి చెందిన కొండ అనూష..అమెరికాలో ఉంటున్నారు. ఆమెకు చెందిన మూడెకరాల టేకు తోటను అయ్యవారిగూడానికి చెందిన రామకృష్ణ చూసుకుంటున్నాడు. ఇందులో టేకు చెట్లను నరికేందుకు పర్మిషన్ కావాలని మార్చి10న దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతి ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ జాన్ బాషా, ఐకేపీ సర్వేయర్ శేషయ్య డిమాండ్ చేశారు. కానీ, తాను పేదరైతునని చెప్పడంతో డిస్కౌంట్ ఇస్తామని చెప్పి బాషా రూ.7 వేలు, శేషయ్య రూ.3 వేలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనలతో బాషా, శేషయ్యలతో లంచం గురించి మాట్లాడిన వీడియో రికార్డు చేశాడు. ఆ ఆధారాలను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్ఐ బాషాను ఖమ్మంలోని అతడి ఇంటి వద్ద, శేషయ్యను ఖమ్మం కలెక్టరేట్ లోని సర్వే ఆఫీస్ కి వెళ్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ఖమ్మం సీఐలు విజయ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పైసలిస్తేనే చెట్లు కొట్టేందుకు పర్మిషన్!
- తెలంగాణం
- May 12, 2022
లేటెస్ట్
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
- CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
- సీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు