మూడు రోజుల విదేశీ పర్యటనల భాగంగా జర్మనీలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయల్దేరారు. బెర్లిన్ చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. బెర్లిన్ లో జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి 6వ ఇండియా జర్మనీ ఇంట ర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ లో పాల్గొననున్నారు. రేపు ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు డెన్మార్క్ వెళ్లనున్నారు.
మూడు రోజుల్లో 25 కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని, ఏడు దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరుపుతారు. 50 గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతోనూ మోడీ మాట్లాడనున్నారు.
#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany
— ANI (@ANI) May 2, 2022
(Source:DD) pic.twitter.com/H0yX5LWut4