నిర్మల్, వెలుగు: వడ్ల పైసల్లో కోత పెట్టారని ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్లో జరిగింది. గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన వడ్లను ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్)లో అమ్మేయగా ఇటీవల వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అయితే.. తాము అమ్మిన వడ్లకు సరిప డా డబ్బులు పడలేవని, బస్తాకు ఐదు కిలోల చొప్పున కట్ చేశారంటూ రైతులు ఈ నెల 8న కడ్తాల్లో ఆందోళనకు దిగారు.
రైతులపై క్రిమినల్ కేసులు
అక్కడికి వచ్చిన మంజులాపూర్ పీఏసీఎస్ సీఈవోను అడ్డుకున్నారు. దీంతో ఆయన విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ముగ్గురు రైతులపై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో గుర్రం పోచులు, బార్మా మారుతి, గంగయ్య ఉన్నారు. పోలీసుల తీరుపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. న్యాయం కోసం ఆందోళనకు దిగిన వారిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు