మూడు మెట్రో సిటీల్లోని స్టార్టప్​లకు భారీగా డబ్బు

మూడు మెట్రో సిటీల్లోని స్టార్టప్​లకు భారీగా డబ్బు

న్యూఢిల్లీ: మనదేశంలోని మూడు మెట్రో సిటీల్లోని స్టార్టప్​లకు డబ్బు వరదలా పారుతోంది.  ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ మధ్య నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్​సీఆర్​), ముంబై,  బెంగళూరు సిటీల్లోని  స్టార్టప్‌లకు  మొత్తం నిధుల్లో దాదాపు 95శాతం వాటా దక్కింది.  ఇదే ఏడాది ఏప్రిల్–-జూన్ కాలంలో మొత్తం నిధులు 40శాతం తగ్గి 6.8 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లకు పడిపోయాయి. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం భారతీయ స్టార్టప్‌‌‌‌లపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. "స్టార్టప్ డీల్స్ ట్రాకర్ -2022 క్యూ2" పేరుతో పిడబ్ల్యుసి ఇండియా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. మొత్తం నిధుల్లో ప్రారంభ-దశ (ఎర్లీస్టేజ్​​)ఒప్పందాల వాటా 60శాతం కంటే ఎక్కువ ఉంది. ఒప్పందం సగటు విలువ 5 మిలియన్‌‌‌‌ డాలర్లు. ఢిల్లీ, ముంబై,  బెంగళూరు తరువాత చెన్నై,  పూణేల్లో స్టార్టప్​లకు భారీగా ఫండింగ్ వస్తోంది. బెంగళూరులోని ఏడు స్టార్టప్‌‌‌‌లు 2022 రెండవ క్వార్టర్​లో ఒక్కొక్కటి 100 మిలియన్‌‌‌‌ డాలర్లకు పైగా ఫడింగ్ దక్కించుకున్నాయి. వీటిలో డెయిలీ హంట్​, ర్యాపిడో, లీడ్​స్క్వేర్డ్​, లెన్స్​కార్ట్​, క్రెడ్​, ఎథర్​ ఎనర్జీ, అబ్జర్వ్​ ఉన్నాయి. ఇవి సాఫ్ట్​వేర్​ యాజ్​ సర్వీస్​, ఆటోటెక్​సెక్టార్లలో పనిచేస్తున్నాయి. ఢిల్లీ–ఎన్‌‌‌‌సిఆర్‌‌‌‌లోని ఏడు కంపెనీలు డెల్హివరీ, స్టాష్‌‌‌‌ఫిన్, రారియో, గ్రే ఆరెంజ్ రోబోటిక్స్, అబ్సొల్యూట్ ఫుడ్స్, ఫాషింజా,  ఫిజిక్స్ వాలాతో సహా ఒక్కొక్కటి 100 మిలియన్‌‌‌‌ డాలర్లకు పైగా సేకరించాయి.  ముంబైలో నాలుగు స్టార్టప్‌‌‌‌లు అప్‌గ్రేడ్‌​, జెప్టో, కాయిన్​ డీసీఎక్స్​, టర్బిల్​మింట్​  100 మిలియన్‌‌‌‌ డాలర్లకు పైగా వసూలు చేశాయి.   సాఫ్ట్‌‌‌‌వేర్ యాజ్ ఏ సర్వీస్, ఫిన్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు 2022 క్యాలెండర్ ఇయర్​లో 3.1 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ నిధులను సంపాదించాయి. ఇవన్నీ ప్రారంభ దశ ఒప్పందాలు కాగా, సగటు టిక్కెట్ సైజు 5 మిలియన్‌‌‌‌ డాలర్లుగా ఉంది.