రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించిండు

రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించిండు

సీఎం కేసీఆర్ పై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీతమో రామ చంద్రా అంటూ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు.సగం నెల కావొస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవన్నారు. వంతులవారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు చూడలేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.