
తూప్రాన్, వెలుగు: ల్యాండ్ పూలింగ్ను నిరసిస్తూ భూ సేకరణకు వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. ఈ ఘటన గురువారం ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్ పరిధిలోని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో జరిగింది. గ్రామం 44వ నెంబర్ నేషనల్ హైవేకు పక్కనే వుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నెంబర్100లో ఉన్న 97.27 ఎకరాల అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులనుంచి సేకరించి డెవలప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నాళ్లుగా ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కోసం భూ సేకరణకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసేందుకు తూప్రాన్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్నగేశ్తో పాటు పలువురు ఆఫీసర్లు ఇమాంపూర్వచ్చారు.
విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పంచాయతీ ఆఫీస్ వద్దకు తరలివచ్చారు. భూ సేకరణ చేపట్టొద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామ సభ నిర్వహణకు వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్నగేశ్ను గ్రామ పంచాయతీ ఆఫీస్లో నిర్బంధించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, ల్యాండ్పూలింగ్పేరిట భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గసభ్యులతో చర్చించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ను విడుదల చేయించారు.