రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నా

రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నా

ఇండోర్: ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉన్నానని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని కాళీ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు రాజకీయాలు వీలు కల్పిస్తాయని చెప్పారు. ‘‘నేను వాళ్ల ప్రతినిధిగా ఉండాలని జనం కోరుకుంటే రాజకీ యాల్లోకి వస్తాను. అప్పుడు ప్రజలకు నేను మరింత సేవ చేయగలను”అని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు అశాంతిలో కూరుకుపోయాయన్నారు. వాటిని ప్రజలకు చూపించేందుకు మీడియా భయపడుతోందని, ఇలాంటివి ప్రజాస్వామ్య దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని అన్నారు.