ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు  నకిలీ హిందువులు

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు  నకిలీ హిందువులు

న్యూఢిల్లీ: స్వప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీ​నేతలు నకిలీ హిందువులని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆలిండియా మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఐడియాలజీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్​కు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. లక్ష్మీదేవి లక్ష్యాలు సాధించేందుకు సాయపడుతుందని, దుర్గా మాత కాపాడే శక్తిని సూచిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండింటినీ బలోపేతం చేసిందని చెప్పారు. ‘వాళ్లు ఏ రకంగా హిందువులు? హిందూ మతాన్ని వాడుకుంటరు. కాబట్టి, మత బ్రోకర్లు. నకిలీ హిందువులు”అని రాహుల్ అన్నారు.