
సిద్దిపేట రూరల్, వెలుగు: రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మూడెకరాలలోపు రైతులకు రూ.181 కోట్ల నిధులు జమ అయినట్లు తెలిపారు.
సోమవారం 2 ఎకరాల వరకు భూమి కలిగిన 2,06,818 మంది రైతులకు రూ.111,48,26,114 నిధులు, 3 ఎకరాల వరకు భూమి కలిగిన 47,672 మంది రైతులకు రూ.69,85,29,044 జమ చేసినట్లు వెల్లడించారు.