వర్ని, వెలుగు: ఆస్తి విషయంలో కన్న తల్లిని కొట్టి చంపాడో కొడుకు. స్థానికులు, సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్కు చెందిన ముక్కెర చిన్న ఒడ్డెన్న, సాయమ్మ(50)కు కొడుకు నారాయణ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న ఒడ్డెన్న కొన్నేళ్ల కింద చనిపోయాడు. సాయమ్మ పేర మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాని విషయంలో బుధవారం రాత్రి నారాయణ తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సాయమ్మ తలను గోడకేసి కొట్టాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. రుద్రూర్ సీఐ అశోక్రెడ్డి, వర్ని ఎస్సై అనిల్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కూతురు శోభ ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు ఫైల్ చేసినట్లు సీఐ తెలిపారు.