
చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో గల కనకగిరి గుట్టలను ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య, సిబ్బంది సహకారం తో ఎస్పీ గుట్టలు ఎక్కి అక్కడి విషయాలు అడిగి తెల్సుకున్నారు. గుట్ట పై ఉన్న హస్తాల వీరభద్రస్వామి, వ్యూ పాయింట్, కోనేరు , కాకతీయులు నిర్మించిన పలు కట్టడాలను పరిశీలించారు. గుట్ట పై ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్మించిన వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అడవుల అభివృద్ధికి పోలీసుల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.