బీసీలను సర్కారు మోసం చేసింది.. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

బీసీలను సర్కారు మోసం చేసింది.. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ
  • బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ​

హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్​ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్​ నేత శ్రీనివాస్ ​గౌడ్​ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్​ను చెత్తబుట్టలో పారేశారన్నారు. కులగణనను తప్పులతడకగా చేశారని  విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ​.. కేబినెట్‌లో మాత్రం ఆ రేషియోను ఎందుకు పాటించలేదన్నారు. 

బీసీ సబ్​ప్లాన్​కు చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు. ఏడాదికి రూ.20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్​లో పెడతామని చెప్పి పెట్టలేదన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమేంటని అడిగారు.