
- బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: బీసీలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ను చెత్తబుట్టలో పారేశారన్నారు. కులగణనను తప్పులతడకగా చేశారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ .. కేబినెట్లో మాత్రం ఆ రేషియోను ఎందుకు పాటించలేదన్నారు.
బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు. ఏడాదికి రూ.20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్లో పెడతామని చెప్పి పెట్టలేదన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమేంటని అడిగారు.