శానిటేషన్ పనులు చేపట్టాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో

శానిటేషన్ పనులు చేపట్టాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో
  • సబ్ కలెక్టర్ వికాస్ మహతో 

బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలో చేపడుతున్న శానిటేషన్ పనులు చేపట్టాలని సబ్​ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. బుధవారం పట్టణంలోని  శక్కర్​నగర్​లోని దోబిగల్లీ, శాంతినగర్​, డీ-40/11, నర్సపూర్ రోడ్డు వెంట ఉన్న నిజాంసాగర్​ కాల్వను పరిశీలించారు. 

కాల్వలోని గడ్డి, మురికిని తొలగించాలని మున్సిపల్​ సిబ్బందికి సూచించారు.  అనంతరం పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు బిల్లులు అందించాలని హౌసింగ్​ ఏఈకి సూచించారు. సబ్​ కలెక్టర్​ వెంట మున్సిపల్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.