
- సబ్ కలెక్టర్ వికాస్ మహతో
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలో చేపడుతున్న శానిటేషన్ పనులు చేపట్టాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. బుధవారం పట్టణంలోని శక్కర్నగర్లోని దోబిగల్లీ, శాంతినగర్, డీ-40/11, నర్సపూర్ రోడ్డు వెంట ఉన్న నిజాంసాగర్ కాల్వను పరిశీలించారు.
కాల్వలోని గడ్డి, మురికిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇండ్లకు బిల్లులు అందించాలని హౌసింగ్ ఏఈకి సూచించారు. సబ్ కలెక్టర్ వెంట మున్సిపల్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.