బద్రీనాథ్లో సూపర్ స్టార్ రజినీ

 బద్రీనాథ్లో సూపర్ స్టార్ రజినీ

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ సినిమా.. ఆగస్టు 10న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే రేంజ్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.

లేటెస్ట్ గా రజినీ ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ టెంపుల్ ను విసిట్ చేశారు. రీసెంట్ గా హిమాలయ పర్యటనకు వెళ్లిన రజినీ పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా చూస్తూ..రిలాక్స్ అవుతున్నారని తెలుస్తోంది.అలాగే రజినీ జైలర్ మూవీ సక్సెస్ చేసినందుకు..ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫ్యాన్స్ కు  విషెస్ తెలిపారు. దీంతో బద్రీనాథ్ టెంపుల్ కు భారీగా ఫ్యాన్స్ రావడంతో పాటు స్పెషల్ ఆఫీసర్స్,టెంపుల్ యాజమాన్యం ఘనంగా రిసీవ్ చేసుకున్నట్లు రజినీ వెల్లడించారు. ప్రస్తుతం రజినీ బద్రీనాథ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా జైలర్ సినిమా మోదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్  రాబట్టింది. ఇక రెండో రోజు రూ.56 కోట్ల గ్రాస్ వసూలు చేయగా..మూడో రోజు 68 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మూడు రోజుల్లోనే జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.