నిర్మాతగా ధోనీ

నిర్మాతగా ధోనీ

ముంబై: టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలందించి అత్యద్భుత కెప్టెన్ గా మన్ననలు అందుకున్న మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్​ ధోనీ కొత్త ఇన్నింగ్స్‌‌ ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన మహీ తొందర్లోనే సినిమా ఫీల్డ్‌‌లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఓ కోలీవుడ్ చిత్రం ద్వారా మహీ నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార కీలకపాత్ర పోషించబోతుందట. ఐపీఎల్ ముగియగానే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే తన బయోపిక్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న మహీ.. నిర్మాతగా ఏమేర సక్సెస్ అవుతాడో చూడాలి.