నస్పూర్‌‌లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : టీడబ్ల్యుజేఎఫ్ నాయకులు

నస్పూర్‌‌లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : టీడబ్ల్యుజేఎఫ్ నాయకులు

నస్పూర్‌‌, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యుజేఎఫ్) నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందించి మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో సర్కారు మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. చాలీచాలని జీతాలతో వెళ్లదీస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

అక్రిడిటే షన్ కార్డుల గడువు పెంచకుండా కొత్తవి మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించాలని కోరారు. కరోనా సమయంలో ఆపేసిన రైల్వే పాస్​లను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశ్ యాదవ్, మధుసూదన్, జిల్లా కోశాధికారి క్యాతం రాజేశ్, ఉపాధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, జీవన్ బాబు, జర్నలిస్టులు పాల్గొన్నారు.