ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో కంప్యూటర్ల చోరీ

ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో కంప్యూటర్ల చోరీ
  • చిక్కినట్టే చిక్కి పరారైన దొంగ

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ప్రెస్ క్లబ్​లో 7 కంప్యూటర్లు, సీసీటీవీ డివైస్​లు చోరీకి గురయ్యాయి. ప్రెస్ క్లబ్​నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు వీటిని ఒక్కొక్కటిగా దొంగలించాడు. ఆఖరిగా సీసీటీవీ యూనిట్​ను తీసుకుని వెళ్తుండగా, రాజు అనే విలేకరి అడ్డుకున్నాడు. దీంతో దుండగుడు ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులే తమను వీటిని తీసుకురమ్మంటున్నారని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

అనంతరం ఆ దొంగ వెంట రాజుకు కూడా స్థానిక పీఎస్​కు వెళ్లాడు. అక్కడ ఏ పోలీసులు కంప్యూటర్ తీసుకురమ్మన్నారని ప్రశ్నిస్తుండగా, సదరు దొంగ గోడ దూకి పరారయ్యాడు. ఈ ఘటనపై ఇన్​స్పెక్టర్ భాస్కర్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరస్తుడే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.