రిటైర్ట్ ఉద్యోగులకు లాభాల వాటా వెంటనే ఇవ్వాలి : సెక్రటరీ వేణుమాధవ్

రిటైర్ట్ ఉద్యోగులకు  లాభాల వాటా వెంటనే ఇవ్వాలి :  సెక్రటరీ వేణుమాధవ్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్ట్​ఉద్యోగులకు లాభాల వాటా, పీఎల్ఆర్​బోనస్​వెంటనే ఇవ్వాలని  సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వేణుమాధవ్, టీబీజీకేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్​చేశారు. 

మంగళవారం శ్రీరాంపూర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేర్వేరుగా మాట్లాడారు. 2024–-25 ఆర్థిక సంవత్సరం ప్రకటించిన లాభాల వాటా, పీఎల్ఆర్​ బోనస్​చెల్లింపులో యాజమాన్యం జాప్యం చేస్తోందన్నారు.  సర్వీస్​లో ఉన్న ఉద్యోగులకు సెప్టెంబర్​ 29న చెల్లించిందని, 3 నెలలు గడుస్తున్నా రిటైర్ట్​ఉద్యోగులకు ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.