- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
కరీంనగర్ జిల్లా: టీఆర్ఎస్ కు పోయే కాలం దగ్గర పడింది.. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. శనివారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పాలన స్తంభించిందన్నారు. రాజకీయమే పరమావధిగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి ఆ పార్టీ దిగజారిందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యను రాజకీయం చేసి లబ్ది పొందాలనుకోవడం అవివేకమని ఆయన పేర్కొన్నారు. రైతుల పంటను సక్రమంగా కొనుగోలు చేయలేక యాసంగి పంటపై లేనిపోని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఒప్పందం మేరకు పంట కొనుగోళ్లు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటన చేసినా రాద్ధాంతం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం
జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్