మెదక్ (నిజాంపేట): పొలం విషయంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధి తిప్పనగుళ్ల గ్రామంలో జరిగింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరు మీద ఉన్న 2 ఎకరాల 10 గుంటల భూమిలో పెద్ద కొడుకు నర్సింలు భార్య సంపూర్ణ పేరుపై 20 గుంటల భూమిని పట్టా చేయించాడు. ఈ క్రమంలోనే చిన్న కొడుకు శ్రీనివాస్ తన తండ్రితో మాట్లాడి తన భార్య పేరు మీద ఒక ఎకరా 28 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. అప్పటి నుండి పెద్ద కోడలు, పెద్ద కొడుకు ఇద్దరూ నర్సయ్యను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన నర్సయ్య మంగళవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొడుకు వేధింపులు భరించలేక తండ్రి ఆత్మహత్య
- తెలంగాణం
- June 23, 2021
లేటెస్ట్
- ఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
- మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు
- కల్లూరు ఆర్డీవోగా రాజేంద్ర గౌడ్ బాధ్యతలు స్వీకరణ
- రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్
- సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల తనిఖీలు
- ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..