ఇబ్రహీంపట్నం, వెలుగు: ముప్పై ఏండ్ల క్రితం తమకు పునరావాసం కింద ఇచ్చిన భూమిని వేరేవారికి అప్పజెప్పారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో ముంపు బాధితులు ఆందోళన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో గోదావరి తీరం పరిశీలనకు గురువారం వచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తిరిగి వెళ్తుండగా కాన్వాయ్ను ముంపు బాధితులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎర్ధండిలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు తలదాచుకోవడానికి పునరావాసం కింద గ్రామ శివారులోని సర్వే నం.104 లో 70 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించి పలువురికి పట్టాలు ఇచ్చిందని, వరదలు వచ్చినప్పుడల్లా చాలాసార్లు ఆయా స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నామని బాధితులు చెప్పారు. కానీ ఈ మధ్యలో ఓ వ్యక్తికి ఆ భూమికి సంబంధించి ప్రభుత్వంపట్టా ఇచ్చిందని, అందులో తాము వేసుకున్న గుడిసెలను తొలగించి పంటలను సాగు చేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడో ఉండాలో తెలియడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు మీకు విన్నవించిన పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ ఎమ్మెల్యే వెహికల్కు అడ్డుగా నిలబడి నినాదాలు చేశారు. సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పినా బాధితులు వినకపోవడంతో పోలీస్ బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు.
ఎమ్మెల్యేను అడ్డుకున్న ముంపు బాధితులు
- తెలంగాణం
- July 15, 2022
లేటెస్ట్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్