పట్టాల మధ్య వంట.. రైలు వచ్చిందంటే తంటా

పట్టాల మధ్య వంట.. రైలు వచ్చిందంటే తంటా

ముంబై:   కొందరు మహిళలు ముంబైలో రైల్వే పట్టాల మధ్య వంట వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఈ వీడియో క్లిప్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో.. రైలు పట్టాల మధ్య కూర్చున్న మహిళలు స్టవ్ మీద వంట వండుతున్నారు. కొంత మంది బాలికలు అక్కడే చదువుకుంటున్నారు. పిల్లలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

సమీపంలో కొంత మంది నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను కొన్ని గంటల్లోనే 21 వేల మందికి పైగా చూశారు.  దీంతో కొంత మంది కామెంట్ సెక్షన్ లో  ఆందోళన  వ్యక్తం చేశారు. ‘ఇటువంటి పనులు చాలా ప్రమాదకరం. దయచేసి ఎవరైనా చర్య తీసుకోండి’ అని నెటిజన్లు కోరారు. ముంబై సెంట్రల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ ఎం) ఈ వీడియోపై స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని పశ్చిమ రైల్వే అధికారులను ఆదేశించారు.